యాప్నగరం

LIC: 10వ తరగతి పాసైన విద్యార్థులకు రూ.10,000 స్కాలర్‌షిప్‌.. ఈనెల 30 దరఖాస్తులకు చివరితేది

LIC Scholarship 2022: ఇందులో భాగంగా అర్హులైన విద్యార్థులు స్కాలర్షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 11వ తరగతి/ ఇంటర్‌లో చేరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 26 Sep 2022, 5:49 pm
LIC Scholarship 2022: దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం స్కాలర్షిప్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన విద్యార్థులు స్కాలర్షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 11వ తరగతి/ ఇంటర్‌లో చేరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Samayam Telugu LIC HFL Vidyadhan Scholarship 2022


LIC HFL Vidyadhan Scholarship 2022 స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన కాలేజీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 11వ తరగతి/ ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశం పొంది ఉండాలి. అలాగే పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ.3,60,000 లోపు ఉండాలి. కరోనా కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

Indian Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.10,000 చొప్పున రెండేళ్లు స్కాలర్షిప్‌ను అందిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, విద్యార్హత మార్క్స్ షీట్, ఆదాయ దృవీకరణ పత్రం, ప్రస్తుతం ప్రవేశం పొందిన కాలేజ్ ఐడి లేదా బోనఫైడ్ సర్టిఫికెట్, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాస్ట్ సర్టిఫికెట్ తదితర డ్యాక్యుమెంట్లు ఉండాలి. స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 30 చివరి తేది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంటర్‌ పూర్తి చేసి.. డిగ్రీ చేరిన వారికి స్కాలర్‌షిప్‌లు:
ఇంటర్‌ పూర్తి చేసిన వారికి కూడా ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్‌ పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ స్కాలర్‌షిప్‌ను దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) మొదటి ఏడాది ప్రవేశం పొంది ఉండాలి.

ఈ విద్యార్థులు 12వ తరగతి/ ఇంటన్‌ బోర్డు ఎగ్జామ్స్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3,60,000 లోపు ఉండాలి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 చొప్పున మూడేళ్లు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 30 చివరితేది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.