యాప్నగరం

ఇంటర్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోండి

scholarships.gov.in: ఎంహెచ్‌ఆర్‌డీ ఇచ్చే జాతీయ స్కాలర్‌షిప్‌లకు ఇంటర్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Samayam Telugu 5 Dec 2020, 1:09 pm
ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఇంటర్మీడియట్‌‌లో మెరిట్‌ సాధించిన వారు కేంద్ర విద్యాశాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఇచ్చే జాతీయ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌ల‌ కోసం దరఖాస్తు చేసుకునే గడువును డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగించారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu జాతీయ స్కాలర్‌షిప్‌లు


ప్రాథమికంగా ఎంపికైన 52,740 మంది విద్యార్థుల జాబితాను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచామని.. వారందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు జాబితాను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలాగే ఈ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను https://scholarships.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Must read: విద్యార్థులకు సూపర్‌ ఛాన్స్‌.. ఇన్‌స్పైర్‌ పోటీల్లో రూ.10 వేలు పొందే అవకాశం..!

Also read: ఇంటర్ పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.