యాప్నగరం

SBI Asha Scholarship 2022: స్టూడెంట్స్‌కు ఎస్‌ఐబీ రూ.15,000 స్కాలర్‌షిప్‌.. 6 నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు

State Bank of India: ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్‌ షిప్‌తో ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6 నుంచి 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 22 Sep 2022, 1:19 pm
SBI Asha Scholarship 2022: పేద విద్యార్థులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రతిభ కలిగి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఔత్సాహిక విద్యార్థులకు దేశీయ ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) స్కాలర్‌షిప్‌ ప్రకటించింది. ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్‌ షిప్‌తో ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6 నుంచి 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.
Samayam Telugu SBI Asha Scholarship Program 2022


ఈ స్కాలర్‌షిప్‌కు అప్లయ్‌ చేసుకునే విద్యార్థులు 6 నుంచి 12వ తరగతులు చదువుతన్న వారై ఉండాలి. గడిచిన అకడమిక్‌ పరీక్షల్లో మినిమం 75 శాతం మార్కులతో పాసై ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి. అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చసుకోవాల్సి ఉంటుంది.

SBI PO 2022 Notification: డిగ్రీ అర్హతతో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా అప్లయ్‌ చేసుకోండి
దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలివే:
దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు గతేడాది అకడమిక్‌ పరీక్షల మార్క్‌ షీట్‌, ప్రభుత్వం అందించిన ఏదైనా గుర్తింపు కార్డు, ప్రస్తుత ఏడాది అడ్మిషన్‌ ధృవీకరణ పత్రం, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, ఇన్‌కమ్‌ప్రూఫ్‌ (ఫార్మ్‌ 16 ఎ/ఇన్‌కమ్‌సర్టిఫికెట్‌/శాలరీ పేస్లిప్‌), అప్లయ్‌ చేసుకున్న వ్యక్తి ఫొటో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 15 చివరితేది. పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్‌ చూడొచ్చు.

LIC Scholarship: ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ.20,000 వరకూ స్కాలర్‌షిప్‌.. అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే
LIC HFL Vidyadhan Scholarship 2022: LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) తన అనుబంధ విభాగం.. హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (LIC HFL).. విద్యాధన్ స్కాలర్‌షిప్ పేరుతో స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది.

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.