యాప్నగరం

SBI: విద్యార్థులకు రూ.15,000 స్కాలర్‌షిప్‌.. 6 నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులు అప్లయ్‌ చేసుకోండి.. అవసరమైన సర్టిఫికెట్లు ఇవే

SBI Asha Scholarship 2022: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్‌ షిప్‌ పేరుతో ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 3 Oct 2022, 5:34 pm

ప్రధానాంశాలు:

  • ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్‌ 2022
  • 6 - ఇంటర్‌ వరకు విద్యార్థులు అర్హులు
  • దరఖాస్తులకు అక్టోబర్‌ 15 చివరితేది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu State bank of India
SBI Asha Scholarship 2022: పేద విద్యార్థులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రతిభ కలిగి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఔత్సాహిక విద్యార్థులకు దేశీయ ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) స్కాలర్‌షిప్‌ ప్రకటించింది. ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్‌ షిప్‌తో ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6 నుంచి 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.
ఈ స్కాలర్‌షిప్‌కు అప్లయ్‌ చేసుకునే విద్యార్థులు 6 నుంచి 12వ తరగతులు చదువుతన్న వారై ఉండాలి. గడిచిన అకడమిక్‌ పరీక్షల్లో మినిమం 75 శాతం మార్కులతో పాసై ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి. అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలివే:
దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు గతేడాది అకడమిక్‌ పరీక్షల మార్క్‌ షీట్‌, ప్రభుత్వం అందించిన ఏదైనా గుర్తింపు కార్డు, ప్రస్తుత ఏడాది అడ్మిషన్‌ ధృవీకరణ పత్రం, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, ఇన్‌కమ్‌ప్రూఫ్‌ (ఫార్మ్‌ 16 ఎ/ఇన్‌కమ్‌సర్టిఫికెట్‌/శాలరీ పేస్లిప్‌), అప్లయ్‌ చేసుకున్న వ్యక్తి ఫొటో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 15 చివరితేది. పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Railway Jobs: రైల్వేలో 3115 జాబ్స్‌.. 10వ తరగతి పాసై ఈ అర్హతలుంటే చాలు
RRC Eastern Railway Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. కోల్‌కతాలోని తూర్పు రైల్వే (Eastern Railway)- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC).. తూర్పు రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటీస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. Eastern Railway ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3115 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితర ట్రేడుల్లో ఈఖాళీలున్నాయి. పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.