యాప్నగరం

TS TET Hall Ticket: తెలంగాణ టెట్‌ అభ్యర్థులకు ఊరట.. హాల్‌టికెట్లపై తప్పులున్నాయా..? అయితే ఇలా చేయాలని..

TS TET Hall Ticket 2022 Download: ఈ నెల 12న రాష్ట్రంలో టెట్‌ నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పేపర్‌-1 కోసం 3,51,468 మంది, పేపర్‌-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ టెట్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు జూన్‌ 6 నుంచి https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 7 Jun 2022, 5:45 pm
TS TET Hall Ticket 2022: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) అభ్యర్థులకు అధికారులు ఊరట కల్పించారు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకున్నా, తప్పులు దొర్లినా.. ఆ తప్పులను సరిచేసి, ఫొటో అతికించి గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరిస్తే పరీక్షకు అనుమతించాలని అధికారులు తాజాగా సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ నెల 12న రాష్ట్రంలో టెట్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష పేపర్‌-1 కోసం 3,51,468 మంది, పేపర్‌-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Samayam Telugu TS TET Hall Ticket


ఇక TS TET 2022 పరీక్ష జూన్ 12న జరగనుంది. ఈ టెట్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు జూన్‌ 6 నుంచి https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. టెట్ పూర్తయిన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది.

ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయొచ్చు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ మార్పులు చేసింది.

TS Govt Jobs: తెలంగాణలో మరో 1433 ఉద్యోగాలు.. ప్రభుత్వం అనుమతి.. త్వరలో నోటిఫికేషన్లు.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే
TS TET 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
  • హాల్ టికెట్స్ డౌన్‌లోడ్: జూన్ 6 నుంచి
  • పరీక్ష తేదీ: 2022 జూన్ 12 (పేపర్ 1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది)
  • ఫలితాల విడుదల: జూన్ 27, 2022

కాగా టెట్‌ పరీక్ష జూన్‌ 12 న మొత్తం 33 జిల్లాల్లో జరగనుంది. పేపర్‌-1, పేపర్-2 రెండు పరీక్షలు ఒకటే రోజు జరగనున్నాయి. పేపర్‌ -1 ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి 12 గంటలకు, పేపర్‌-2 పరీక్ష మద్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. రెండు పేపర్లు రాసే అభ్యర్ధులు ఆయా సమయాల్లో పరీక్షకు హాజరుకావచ్చు.

కాగా ఈసారి రెండు పేపర్లకు హాజరయ్యేవారి సంఖ్య అధికంగా ఉంది. పేపర్‌ 1, పేపర్‌ 2లకు కలిపి మొత్తం 3,79,101 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్ష అనంతరం ఫలితాలు మే 27న వెల్లడవుతాయి.

తెలంగాణలో 80,039 పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులున్నాయి. 6,500 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు, 2,000 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 600 వరకు భాషా పండితుల పోస్టులు ఉన్నాయి. అవసరమైతే మరో 10,000 పోస్టుల్ని కూడా భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.