యాప్నగరం

Scholarship: అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు.. ఏడాదికి రూ.36,200 పొందొచ్చు.. ఈ కోర్సులు చదువుతున్న వారికి మాత్రమే..!

Indira Gandhi Scholarship for Single Girl 2022: ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారికి పీజీలో ఏడాదికి రూ.36,200 చొప్పున రెండేళ్లపాటు అందుతాయి. ఈ డబ్బులు నేరుగా విద్యార్థినుల ఖాతాలో జమ అవుతాయి. వీటిని ఫీజు, వసతి, పుస్తకాలు నిమిత్తం ఉపయోగించుకోవచ్చు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 26 Oct 2022, 9:58 am
Scholarship: తల్లిదండ్రుల దృక్పథం, సామాజిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం.. తదితర కారణాలతో చాలామంది అమ్మాయిలు ఆసక్తి ఉన్నప్పటికీ ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. పీజీ చదువుతున్న అమ్మాయిల కోసం ఇందిరాగాంధీ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. వీటికి ఎంపికైనవారికి పీజీలో ఏడాదికి రూ.36,200 చొప్పున రెండేళ్లపాటు అందుతాయి. ఈ డబ్బులు నేరుగా విద్యార్థినుల ఖాతాలో జమ అవుతాయి. వీటిని ఫీజు, వసతి, పుస్తకాలు నిమిత్తం ఉపయోగించుకోవచ్చు.
Samayam Telugu Indira Gandhi single child scholarship 2022


ఆర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోత్సాహం అందుకున్నవారు ఇతర స్కాలర్‌షిప్పులకూ ప్రయత్నించుకోవచ్చు. ఇందిరాగాంధీ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ల ద్వారా అమ్మాయిలకు ఆర్థికంగా అండగా నిలిచి.. చదువులో ప్రోత్సహించి, పీజీ చదివే మహిళల సంఖ్య పెరిగేలా చూడాలన్నది యూజీసీ లక్ష్యం.

10వ తరగతితో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం

అర్హతలు: తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె అయివుండాలి. అలాగే మొదటి సంతానంలో ఇద్దరూ కవలలు అది కూడా అమ్మాయిలే అయితే వారిద్దరికీ ఈ స్కాలర్‌షిప్పునకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే స్కాలర్‌షిప్పు వర్తించదు. ఈ విద్యా సంవత్సరంలో పీజీ ప్రథమ సంవత్సరంలో చేరినవాళ్లే దీనికి అర్హులు. గరిష్ఠ వయసు 30 ఏళ్లు మించరాదు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం.. కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరినవారికి అవకాశం లేదు. అలాగే దూరవిద్యలో పీజీ కోర్సులు చదువుతున్నవాళ్లు కూడా అర్హులు కాదు. ఈ స్కాలర్‌షిప్పు పొందిన విద్యార్థినులు ఇతర ప్రోత్సాహకాలకూ దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఈ స్కాలర్‌షిప్‌లకు ఏడాదికి 3000 మందికి అందజేస్తారు.

దరఖాస్తు విధానం:
  • పీజీ ఫస్టియర్‌ చదువుతున్నట్టు ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాలి. దీని ఫార్మాట్‌ కూడా వెబ్‌సైట్‌లో లభిస్తుంది. దానిపై వివరాలు పూరించాలి. సంబంధిత యూనివర్సిటీ/కాలేజీ ప్రిన్సిపల్‌ సంతకం తప్పనిసరి. అలాగే తల్లిదండ్రులకు ఏకైక సంతానమని నిర్ధారిస్తూ అధికారుల ధ్రువీకరణ అఫిడవిట్‌నూ పొందుపరచాలి. ఈ పత్రాలను దరఖాస్తుతో పాటు అప్‌లోడ్‌ చేయాలి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31, 2022
  • పూర్తి వివరాలకువెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. రేపటి నుంచి పార్ట్‌ 2 అప్లికేషన్లు ప్రారంభం.. అప్‌లోడ్‌ చేయాల్సిన సర్టిఫికెట్లు ఇవే
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.