యాప్నగరం

హిందూపురంలో బాలయ్య.. గెలుపుపై లెక్కలేస్తున్నారట..!

పోలింగ్ ముగిశాక హైదరాబాద్ వెళ్లిన బాలయ్య.. మళ్లీ సుమారు పది రోజుల తర్వాత శుక్రవారం (26-04-2019) నియోజకవర్గానికి వెళ్లారు.రెండు రోజుల పాటూ హిందూపురంలో మకాం వేయనున్నారు.

Samayam Telugu 26 Apr 2019, 8:49 pm

ప్రధానాంశాలు:

  • హిందూపురంలో నందమూరి బాలయ్య పర్యటన
  • రెండు రోజుల పాటూ నియోజకవర్గంలోనే మకాం
  • ఎన్నికల సరళిపై నేతలు, కార్యకర్తలతో సమీక్ష?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu balayya.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూముల్లోకి చేరింది. పోలింగ్ శాతం పెరగడం.. మహిళలు భారీగా తరలివచ్చి ఓట్లు వేయడంతో ప్రజల నాడి పట్టుకోవడం కష్టంగా మారింది. పైకి వైసీపీ, టీడీపీలు ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నా.. గెలుపు, ఓటములపై లెక్కలేసుకునే పనిలో ఉన్నారు. బూత్‌లవారీగా బలాబలాలు ఎలా ఉన్నాయో ఆరా తీస్తున్నారట.
హిందూపురం నుంచి బరిలోకి దిగిన నందమూరి బాలకృష్ణ కూడా గెలుపుపై లెక్కలేసే పనిలో ఉన్నారట. పోలింగ్ ముగిశాక హైదరాబాద్ వెళ్లిన బాలయ్య.. మళ్లీ సుమారు పది రోజుల తర్వాత శుక్రవారం (26-04-2019) నియోజకవర్గానికి వెళ్లారు. రెండు రోజుల పాటూ హిందూపురంలో మకాం వేయనున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం.. మండలాల వారీగా నేతలు, కార్యకర్తలతో నివాసంలో సమావేశమయ్యారట.

నేతలు, పార్టీ కేడర్‌తో అంతర్గతంగా నిర్వహించిన ఈ సమావేశంలో పోలింగ్ సరళిపై చర్చించారట. బూత్‌ల వారీగా లెక్కలు వేసుకున్నారట. మెజార్టీ ఎంతొస్తుందో ఆరా తీశారట. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో చిలమత్తూరు, లేపాక్షి మండలాలతో పాటు హిందూపురం మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల బూత్ మెంబర్లతో సమీక్ష చేశారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.