యాప్నగరం

మే 6న ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్.. ఆ పోలింగ్ బూత్‌లివే!

ఆంధ్ర ప్రదేశ్‌లోని ఐదు చోట్ల మే 6న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని ఈసీ సంబంధిత అధికారులను ఆదేశించింది.

Samayam Telugu 1 May 2019, 11:12 pm
ఏపీలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో మే 6న రీ పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్ కృష్ణ ద్వివేదీ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని కేసనపల్లిలోని 94వ నెంబర్ పోలింగ్‌ బూత్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ పోలింగ్‌ బూత్, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్‌ బూత్, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ పోలింగ్‌ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధి కలనూతలలోని 247వ పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.
Samayam Telugu pollingg


ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న ఎన్నికల్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈవీఎంలు మొరాయించడం, పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడం, ఘర్షణలు తలెత్తడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బూత్ స్థాయిల్లో పరిస్థితులను పరిశీలించి అధికారుల నివేదిక మేరకు ఈ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ జరిపాలని ఈసీ నిర్ణయించింది.

మే 6న ఐదో దశ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 12న ఆరో దశ, 19న ఏడో దశ పోలింగ్ జరగనుంది. మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.