యాప్నగరం

వైసీపీని బీజేపీలో కలిపేయడం ఖాయం: చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లడం వైసీపీ అహంభావానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఎంతకైనా దిగజారే ప్రత్యర్థి పట్ల టీడీపీ శ్రేణులన్నీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Samayam Telugu 6 Apr 2019, 12:11 pm
రాష్ట్రం నుంచి పేదరికాన్ని నిర్మూలించేందుకే ఆడపడుచులకు పసుపు-కుంకుమ కింద రూ.10వేలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టామని, నిరుద్యోగ యువతలో భరోసా పెంచేందుకు యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి ఇస్తున్నామని తెలిపారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఉగాది రోజున మేనిఫెస్టో విడుదల చేస్తున్నామన్నారు.
Samayam Telugu chan


ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లడం వైసీపీ అహంభావానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఎంతకైనా దిగజారే ప్రత్యర్థి పట్ల టీడీపీ శ్రేణులన్నీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారుల బదిలీలతో టీడీపీకి అధికారం దూరం చేయలేరన్నారు. కేంద్రం సాయంతో వైసీపీ నేతలు దర్యాప్తు సంస్థలతో పాటు, ఎన్నికల సంఘాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ ఎన్డీయేలో చేరతాడని కేంద్రమంత్రి అధవాలే ప్రకటించడాన్ని బట్టే వైసీపీ, బీజేపీ కుమ్మక్కు తెలుస్తోందని చంద్రబాబు అన్నారు. కేసుల భయంచూపి జగన్‌ను బీజేపీ లొంగదీసుకుందని ఆరోపించారు. కేసుల మాఫీకోసం జగన్ వైసీపీని మోదీకి తాకట్టు పెట్టాడని, హైదరాబాద్‌లోని ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్‌కు పార్టీని అమ్మేశాడని ఆరోపించారు. ఎన్నికలయ్యాక వైసీపీని బీజేపీలో కలిపేయడం ఖాయమని చంద్రబాబు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.