యాప్నగరం

జూన్ 7న వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. అదే రోజు క్యాబినెట్ ప్రకటన!

సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుదిశగా అడుగులు వేస్తున్నారు. తన మంత్రివర్గ కూర్పుపై కూడా ఆయన దృష్టిసారించారు.

Samayam Telugu 3 Jun 2019, 11:07 am
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు. సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన రోజే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుదిశగా అడుగులు వేస్తోన్న జగన్, తన మంత్రివర్గ కూర్పుపై కూడా దృష్టిసారించారు. జూన్ 8 క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన సీఎం, దీనికి అనుగుణంగా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ శాసనసభాపక్షం జూన్ 7న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన నిర్వహించబోయే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. జూన్ 8న క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో.. మంత్రివర్గంలోకి ఎవరిని, ఎందుకు తీసుకుంటున్నామనే విషయాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ వివరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో చోటుకోసం ఆశావాహులు అధికంగానే ఉండటంతో ఆశావాహుల్లో అసంతృప్తి తలెత్తకుండా వ్యూహాత్మకంగానే జగన్ శాసనసభా పక్షాన్ని ఏర్పాటుచేసినట్టు సమాచారం.
Samayam Telugu Jagan meeting


అదే రోజు మంత్రిపదవుల దక్కినవారి పేర్లను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, జూన్ 12 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పదవుల్లో ఎవర్ని నియమించాలన్న అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే సూచనలు ఉన్నాయి. సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనా కూడా చర్చించనున్నారు. విషయ పరంగా, ప్రతిపక్షాల దాడిని సమర్ధంగా తిప్పికొట్టే బృందంలో ఏ ఎమ్మెల్యే ఉండాలన్న దానిపైనా చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఎజెండా సోమవారం ఖరారు చేస్తారని తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.