TDP Elections 2019: చంద్రబాబు వర్సెస్ వైఎస్ జగన్.. హోరా-హోరీ పోరు
వైసీపీ, టీడీపీ మధ్య హోరా-హోరీ పోరు కనిపిస్తోంది.. రెండు పార్టీలు నువ్వా-నేనా అన్న రేంజ్లో తలపడుతున్నాయి. చంద్రబాబు, జగన్లు ఎవరికి వారే గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నారు.
Samayam Telugu 11 Apr 2019, 10:18 am
ఏపీ ఎన్నికలు హై వోల్టేజ్ను తలపిస్తున్నాయి. ఐదు పార్టీలు పోటీలో ఉన్నా.. ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య హోరా-హోరీ పోరు కనిపిస్తోంది. రెండు పార్టీలు నువ్వా-నేనా అన్న రేంజ్లో తలపడుతున్నాయి. టీడీపీ, వైసీపీలు ప్రచారంతో హోరెత్తించాయి.. పవర్ పంచ్లతో ఓటర్లలోకి దూసుకెళ్లాయి. చంద్రబాబు, జగన్లు ఎవరికి వారే గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నారు. వైఎస్ జగన్ చంద్రబాబు పాలనలో అవినీతి, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది.. వైసీపీ బై బై బాబు అంటూ ప్రచారం ముగిస్తే.. టీడీపీ తనదైన శైలిలో తిప్పటికొట్టింది. అలాగే చంద్రబాబు కేసీఆర్-మోదీతో కలిసి జగన్ ఏపీపై కుట్రలు చేస్తున్నారంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే సీఎస్, ఇంటిలిజెన్స్ చీఫ్, కలెక్టర్లు, ఎస్పీలను ఈసీ బదిలీ చేయడంపై.. ఐటీ దాడులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చెప్పినట్లు ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపించారు. విజయవాడలో.. ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలు వైఎస్ జగన్కు అనుకూలంగా ఉంటే.. గ్రౌండ్ రియాలిటీలో మాత్రం హోరా-హోరీ పోరు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.