యాప్నగరం

ఆళ్లగడ్డలో మరోసారి ఉద్రిక్తతలు.. భూమా, గంగుల వర్గీయుల ఘర్షణ.. గాల్లోకి కాల్పులు

ఆళ్లగడ్డలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. భూమా, గంగుల వర్గీయుల మరోసారి ఘర్షణలకు దిగారు. దీంతో పోలిసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

Samayam Telugu 11 Apr 2019, 10:29 pm
ఏపీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగుతున్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఘర్షణలో ఒకరు, చిత్తూరు జిల్లాలో జరిగిన ఘర్షణల్లో మరొకరు మరణించిన సంగతి తెలిసిందే. రాత్రిపూట కూడా ఓట్లేసేందుకు జనం ఓపికగా క్యూలో నిలబడగా.. మరోవైపు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Samayam Telugu veta kodavali


గురువారం రాత్రి కృష్ణా జిల్లా గన్నవరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రసాదంపాడులో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో భారీగా భద్రతా బలగాలను మోహరించాల్సి వచ్చింది. కడప జిల్లా చెన్నయ్యగారి పల్లిలో పోలింగ్ పూర్తయ్యాక టీడీపీ, వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఈ ఘర్షణల్లో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

ఇక ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాత్రి మరోసారి గొడవలు జరిగాయి. భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అంతకు ముందు.. వైసీపీ నేతలు తమ అనుచరుల్ని కిడ్నాప్ చేశారని భూమా వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిడ్నాప్ చేయించారని ఆరోపిస్తూ.. అఖిలప్రియ సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి, సోదరి భూమా మౌనిక కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.