యాప్నగరం

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు: చంద్రబాబు

తాడిపత్రిలో టీడీపీ నేత సిద్దా భాస్కరరెడ్డి మరణం, సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడిని ఖండించిన చంద్రబాబు.

Samayam Telugu 11 Apr 2019, 1:55 pm
పీ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా జరుగుతున్న దాడులపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తాడిపత్రిలో టీడీపీ నేత సిద్దా భాస్కరరెడ్డి మరణం, సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడిని ఖండించారు. ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడుతోందని, టీడీపీ ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారన్నారు.
Samayam Telugu Untitl


వెనక్కి వెళ్లవద్దు.. వచ్చి ఓటేయండి: ఈవీఎంలు పనిచేయడం లేదంటూ ఓటర్లు వెనుతిరగడం దురదృష్టకరమని చంద్రబాబు నాయుడు అన్నారు. వెనక్కి వెళ్లినవారు తిరిగివచ్చి ఓట్లు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌లో కనిపించే రశీదును తప్పకుండా చెక్ చేసుకోవాలని కోరారు. వేరే పార్టీకి ఓటుపడితే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. ఇలాంటి దుస్థితి స్వాతంత్ర్య భారతదేశంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. ఏం జరిగినా ప్రజలు ఓటుతోనే వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు.

వీరాపురంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు వేటకొడవళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో టీడీపీ నేత సిద్ధా భాస్కర్‌రెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డిలు చనిపోగా.. మరో నలుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన భాస్కర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జీ నిర్వహించారు. అదనపు బలగాలను మోహరించారు.

మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలోని యనమెట్ల గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు కోడెల చొక్కా చింపేశారని, సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను ఆసుపత్రికి తరలించారని తెలిసింది. దాడిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని చితకబాదారని, ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్‌కు చెందిన కెమెరాను, విలేకరి సెల్‌ఫోన్‌లు ధ్వంసమయ్యాయని సమాచారం. అయితే, కోడెల పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి గంటకు పైగా అక్కడే కూర్చొని ఉండటంతో వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారని, ఈ సందర్భంగా అక్కడ తోపులాట జరిగిందని తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.