యాప్నగరం

‘బాబు మైండ్ కంట్రోల్ తప్పింది.. మానసిక చికిత్స తీసుకోవాలి’

చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఆయన మెండ్ కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. డ్రామాలు ఆపి చికిత్స తీసుకోవాలని ఎద్దేవా చేశారు.

Samayam Telugu 12 Apr 2019, 5:56 pm

ప్రధానాంశాలు:

  • చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.
  • ఆయన మెండ్ కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
  • డ్రామాలు ఆపి చికిత్స తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu babub
గత కొన్నాళ్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మెండ్ కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నారన్న ఆయన.. డ్రామాలు ఆపేసి మానసిక చికిత్స తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలవబోతున్న సమయంలో విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఎన్నికల సంఘంలో రిఫామ్స్ తీసుకొస్తాడట. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను కోవర్ట్ అంటాడు. ప్రజలు తుపుక్కున ఉమ్మేస్తే దాన్ని తుడుచుకుని అధికారులు, ఎలక్షన్ కమిషన్ వెంట పడ్డాడు. మైండ్ కంట్రోల్ తప్పి ఏదోదో మాట్లాడుతున్నాడు. డ్రామాలు ఆపేసి, ఓట్ల లెక్కింపు దాకా మానసిక చికిత్స తీసుకో’ అని విజయసాయి ట్వీట్ చేశారు.
‘విశాఖ లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బాలక్రిష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు టికెట్ ఇచ్చి జనసేన లక్ష్మినారాయణకు ప్రచారం చేయాలని క్యాడర్‌ను ఆదేశించాడు. తన ఖర్చంతా భరత్‌తోనే పెట్టించాడు. అయినా వర్కవుట్ కాలేదు. విశాఖలో ఫ్యాన్ అభ్యర్థి సత్యనారాయణ భారీ మెజారిటీతో గెలుస్తున్నాడ’ని వైసీపీ ఎంపీ మరో ట్వీట్ వదిలారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.