యాప్నగరం

లోకేశ్ మళ్లీ ఏసేశారు.. మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తెలంగాణకు..!

నారా లోకేశ్ మళ్లీ తడబడ్డారు. కేసీఆర్‌ను టార్గెట్ చేయబోయి.. సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Samayam Telugu 24 Mar 2019, 11:06 pm

ప్రధానాంశాలు:

  • నారా లోకేశ్ మళ్లీ తడబడ్డారు.
  • కేసీఆర్‌ను టార్గెట్ చేయబోయి.. సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.
  • మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి తనయుడు, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మళ్లీ తడబడ్డారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారంలో కేసీఆర్‌ను విమర్శించే క్రమంలో లోకేశ్ తప్పులో కాలేశారు. ‘కేసీఆర్ ఏపీకి వస్తున్నారంటే కారణాలు రెండే రెండు. ఆయన పోలవరం ప్రాజెక్టును ఆపాలని చూస్తున్నారు. ముంపు మండలాలను మళ్లీ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు ఇక్కడున్న మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నార’ని లోకేశ్ వ్యాఖ్యానించారు.
లోకేశ్ వ్యాఖ్యలు కాసేపట్లోనే వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

నారా లోకేశ్ ఇలా తడబాటుకు గురవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల వివేకానంద హత్య విషయమై మాట్లాడుతూ.. పరశించాం అన్న లోకేశ్.. ఏప్రిల్ 9న టీడీపీకి ఓటేయ్యండంటూ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ప్రతీ గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పడానికి బదులు.. తాగునీరు లేని సమస్యను ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. లోకేశ్ వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.