యాప్నగరం

జగన్‌ గెలవడు, వైసీపీ కోసం పని చేసినందుకు జీవితాంతం బాధ: ప్రశాంత్ కిశోర్ ట్వీట్ వైరల్

రెండేళ్ల మా కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. జగన్ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడం కష్టమే. ఆయన పార్టీతో కలిసి పని చేసినందుకు జీవితాంతం బాధపడతానంటూ.. ప్రశాంత్ కిశోర్ ట్వీట్ పేరిట ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది.

Samayam Telugu 11 Apr 2019, 5:01 pm
ఏపీలో పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ విజయం కోసం పని చేసిన ఆయన.. ‘‘గత రెండేళ్లుగా మా టీం పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. వైఎస్ జగన్‌కు మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడం కష్టమే. అన్ని విధాలుగా పోరాడినప్పటికీ ఆయన వెనుకంజలో ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డితో కలిసి పని చేసినందుకు జీవితాంతం బాధపడతా’’నంటూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ కిశోర్ ఇలా ట్వీట్ చేయడమేంటి? అనుకుంటున్నారా.. మీ అనుమానం నిజమే.. ఆయన ట్వీట్ చేశారంటూ ఓ స్క్రీన్ షాట్‌‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎవరి పనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా..
Samayam Telugu pk jagan


ఈ ఫేక్ ట్వీట్ విషయమై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. సర్క్యులేట్ అవుతున్న స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన.. చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. దూషణలు, అబద్ధాలే కాకుండా.. తప్పుడు కథనాలను సర్క్యులేట్ చేసే స్థాయికి దిగజారారు అని ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు.
పోలింగ్‌కు కొద్ది గంటల సమయమే మిగిలి ఉంది. కానీ ప్రజలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకున్నారు. బై బై బాబు అని చెప్పడానికి ఇదే సరైన తరుణం అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.