యాప్నగరం

TDP: తొడగొట్టి చెబుతున్నా చంద్రబాబే సీఎం: బుద్దా

ఈవీఎంల లోపాలపై చంద్రబాబు పోరాటం చేస్తుంటే.. ఓటమి భయం పట్టుకుందని విపక్షాలు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు వెంకన్న. ఇదంతా ఆ పార్టీల మైండ్ గేమ్‌లో భాగమన్నారు.

Samayam Telugu 14 Apr 2019, 2:11 pm

ప్రధానాంశాలు:

  • ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం
  • మే 23న చంద్రబాబుకు ఏపీ ప్రజలు పట్టాభిషేకం చేస్తారు
  • మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు సజావుగా సాగాలనేది బాబు పోరాటం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu cbn
ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఏపీ ప్రజలు టీడీపీ పక్షాన నిలబడ్డారని.. ఏప్రిల్ 23న ఏపీ ప్రజలు చంద్రబాబు పట్టాభిషేకం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని చెప్పినా.. ఐదేళ్ల పాటు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన చంద్రబాబే మళ్లీ అధికారంలోకి రాబోతున్నారని జోస్యం చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బుద్దా.. వైసీపీపై మండిపడ్డారు.
ఈవీఎంల లోపాలపై చంద్రబాబు పోరాటం చేస్తుంటే.. ఓటమి భయం పట్టుకుందని విపక్షాలు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు వెంకన్న. ఇదంతా ఆ పార్టీల మైండ్ గేమ్‌లో భాగమన్నారు. ఈవీఎంలు పనిచేయక మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడితే.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎన్నికల సంఘం బాగా పనిచేసిందని చెప్పడం దారుణమన్నారు బుద్దా వెంకన్న.

అధికారంలోకి రాకముందే వైసీపీ అరాచకాలు చేస్తోందని.. పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తారేమోనన్నారు. ఇలాంటి వాళ్లు వస్తే.. ప్రజలు బతకగలరా... రక్షణ ఉంటుందా.. అంటూ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఏపీలో ఎన్నికల నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని.. ఇతర రాష్ట్రాల్లోనైనా ఎన్నికల సజావుగా జరగాలని చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. చంద్రబాబు భయపడే రకమైతే ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు వస్తారని ప్రశ్నించారు. ఓటమి భయం అంటూ వైసీపీ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.