యాప్నగరం

Election Commission: ఈసీకి చంద్రబాబు లేఖ.. ఈవీఎంలు పనిచేయని చోట రీపోలింగ్‌కు డిమాండ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ శాతం తక్కువగా ఉండటం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Samayam Telugu 11 Apr 2019, 11:24 am
ఏపీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఈవీఎంలు సరిగా పని చేయకపోవడంతో.. ఉదయం పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. చాలా చోట్ల ఈవీఎం మొరాయించడంతో.. ఓటర్లు గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వస్తోంది. ఈవీఎంలు మొరాయించడానికి తోడు.. ఎన్నికల సంఘం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై రాజకీయ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోలింగ్ ప్రారంభించి 3 గంటలైనా 30 శాతం ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Samayam Telugu ncbn1


ఈవీంఎంలు మొరాయించడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. టీడీపీకి వేసే ఓటు వైసీపీకి వెళ్తోందనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఈవీఎంల మొరాయింపు కారణంగా ఓటింగ్ ఆలస్యమైన చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

పోలింగ్ ఆలస్యం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా 157 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ ఈసీని డిమాండ్ చేసింది. పోలింగ్ ఆలస్యం కావడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పోలింగ్ సమయం పెంచడానికి ఈసీ నిరాకరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.