యాప్నగరం

నర్సరావుపేటలో పోలింగ్ బూత్ ధ్వంసం

టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదానికి దిగి ఒకర్ని ఒకరు తోసుకున్నారు. కుర్చీలు విసిరేసి.. ఈవీఎంలను కూడా పగులగొట్టి పోలింగ్ బూత్‌ను ధ్వంసం చేశారు.

Samayam Telugu 11 Apr 2019, 11:01 am

ప్రధానాంశాలు:

  • పోలింగ్ బూతులో వాగ్వాదానికి దిగిన ఇరు పార్టీల నేతలు
  • లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
  • కుర్చీలు విసిరేసి హంగామా చేసిన కార్యకర్తలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం రామచంద్రాపురంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదానికి దిగి ఒకర్ని ఒకరు తోసుకున్నారు. కుర్చీలు విసిరేసి.. ఈవీఎంలను కూడా పగులగొట్టి పోలింగ్ బూత్‌ను ధ్వంసం చేశారు.
ఇరు పార్టీల కార్యకర్తల ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.