యాప్నగరం

సీఎం జగన్: నెరవేరిన ‘కోడికత్తి’ కేసు నిందితుడి కల

శ్రీనివాసరావు కోరుకున్నట్లుగానే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘనవిజయం సాధించారు. ఏపీలోని 175 స్థానాలకు గాను 151చోట్ల వైసీపీ విజయకేతనం ఎగురవేయడంతో జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు.

Samayam Telugu 24 May 2019, 4:17 pm
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి అధికారం చేపట్టబోతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలంతా జగన్ సీఎం కావాలని దేవుళ్లకు మొక్కారు. గ్రామాల్లో ప్రచారం చేశారు. చివరికి జగన్‌ను సీఎంగా చూడబోతున్నారు. అయితే జగన్ సీఎం కావాలని కోరుకున్న ఓ వ్యక్తి మాత్రం ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతడెవరో కాదు విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు అనే యువకుడు.
Samayam Telugu jagan


గతేడాది అక్టోబరు 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ దాడిలో నిందితుడైన శ్రీనివాసరావు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జగన్‌ సీఎం కావాలన్నదే తన ధ్యేయమని, ఇలా దాడిచేస్తే ఆయనకు సానుభూతి పెరిగి ముఖ్యమంత్రి అవుతారన్న లక్ష్యంతోనే దాడికి పాల్పడినట్లు శ్రీనివాస్ చెప్పడంతో అంతా షాకయ్యారు. జగన్ 2014లోనే జగన్ సీఎం కావాలని కోరుకున్నానని, కానీ అది నెరవేరకపోవడంతో తనతో పాటు తన కుటుంబసభ్యులు కూడా చాలా బాధపడ్డారని శ్రీనివాసరావు తెలిపాడు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపొంది సీఎం కావాలని తాను కోరుకుంటున్నట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు.

శ్రీనివాసరావు కోరుకున్నట్లుగానే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘనవిజయం సాధించారు. ఏపీలోని 175 స్థానాలకు గాను 151చోట్ల వైసీపీ విజయకేతనం ఎగురవేయడంతో జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. దీంతో శ్రీనివాసరావు కల నేరింది. వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొందిన గురువారమే శ్రీనివాసరావు బెయిల్‌పై బయటకు రావడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.