యాప్నగరం

ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా.. తెలిసిన పేరొక్కటే.. బాబు, జగన్‌పైనా పోటీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను ప్రకటించింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో ఉన్నారు. మంగళగిరి, కుప్పం, పులివెందుల నుంచి కూడా పార్టీ అభ్యర్థులను బరిలో దింపింది.

Samayam Telugu 19 Mar 2019, 2:08 am
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్న కాంగ్రెస్ పార్టీ 132 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అనంతపురంలోని కళ్యాణ దుర్గం నుంచి బరిలో దిగబోతున్నారు. జాబితాలో ఆయన పేరొక్కటే సుపరిచితమైంది కావడం గమనార్హం. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నుంచి ఎస్.కె. సలీం పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష నేత జగన్‌కు పోటీగా పులివెందుల నుంచి వేలురు శ్రీనివాస రెడ్డి బరిలో నిలవనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నుంచి సురేశ్ బాబుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది.
Samayam Telugu raghuveera-reddy


చదవండి: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా

అదే సమయంలో 22 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా కాంగ్రెస్ ప్రకటించింది. వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఏపీ విభజనతో గత ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఎన్నికల ముందే కీలక నేతలు ఆ పార్టీని వీడి టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. మిగిలిన కొద్దిపాటి నేతల్లో కోట్ల, హర్షకుమార్, పనబాక, కిశోర్ చంద్రదేవ్ లాంటి నేతలు కూడా ఇటీవల పార్టీ మారారు. దీంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.