వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచార సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. కరెంట్ షాక్ కారణంగా ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం (ఏప్రిల్ 3) మధ్యాహ్నం వైఎస్ జగన్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తైన తర్వాత జనరేటర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో విద్యుత్ఘాతానికి గురై సమీపంలో ఉన్న సోమిరెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన స్థానికంగా ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నారు. ప్రమాదంలో మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు కృష్ణమ్మతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వారం కిందట భవనం స్లాబు కూలి..
సరిగ్గా వారం రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ సభకు హాజరైన వారిలో కొందరు పాత భవనం ఎక్కడంతో స్లాబు అంచు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధురాళ్లు మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తైన తర్వాత జనరేటర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో విద్యుత్ఘాతానికి గురై సమీపంలో ఉన్న సోమిరెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన స్థానికంగా ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నారు.
ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వారం కిందట భవనం స్లాబు కూలి..
సరిగ్గా వారం రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ సభకు హాజరైన వారిలో కొందరు పాత భవనం ఎక్కడంతో స్లాబు అంచు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధురాళ్లు మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు.