యాప్నగరం

AP Chief Secretary: ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీ సీఎస్ పునేఠా ఔట్, ఎల్వీ ఇన్!

ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీ చీఫ్‌ సెక్రటరీ అనిల్‌ చంద్ర పునేఠాపై బదిలీ వేటు, ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చోటు.

Samayam Telugu 5 Apr 2019, 11:13 pm
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ (సీఎస్) అనిల్‌ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తున్నట్లు ప్రకటించింది. పునేఠాను ఎన్నికలతో సంబంధంలేని పోస్టుకు బదిలీ చేయాలని పేర్కొంది.
Samayam Telugu Untitled111


పునేఠాను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఈసీ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా కొనసాగుతారని ఈసీ స్పష్టం చేసింది. ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని పునేఠా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పునేఠాను ఈసీ ఢిల్లీకి పిలిపించింది. ఐపీఎస్‌ల బదిలీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మూడు జీవోలపై వివరణ కోరింది. అయితే, ఆయన ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని ఈసీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.