యాప్నగరం

Lok Sabha Elections: పోలింగ్ సమయం పొడిగింపు.. ఎంతసేపంటే?!

సాధారణంగా ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే గంట ముందే ముగుస్తుంది.

Samayam Telugu 4 Apr 2019, 8:47 am
సాధారణంగా ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే గంట ముందే ముగుస్తుంది. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోలింగ్ సమయాన్ని అదనంగా మరో గంట పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈసారి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. పోలింగ్ సమయం పెంపునకు కారణాలను కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది.
Samayam Telugu polling


ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత ఎవరికి వేశామో ఓటరు వీవీప్యాట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఓటు వేసిన తర్వాత ఇందులో గుర్తు ఏడు సెకన్ల పాటు కనిపిస్తుందని, దీంతో పోలింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని తెలియజేసింది. గతంలో కంటే ఓటర్లు పెరిగారని, వేసవి కావడంతో సాయంత్రం సమయాల్లో ఓటర్లు ఎక్కువగా పోలింగ్‌కు వచ్చే అవకాశం ఉందని ఈసీ భావిస్తోంది. ఈసారి పోలింగ్‌ సమయాన్ని మరో గంట పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుందని సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరూ తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఉదయం 7.00 నుంచి 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్న ఈసీ, మణిపూర్, నాగాలాండ్‌లో మాత్రం 4.00 గంటలకు ముగుస్తుందని స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.