యాప్నగరం

AP Elections: ఓటువేయడానికి వెళ్లిన ఏపీ సీఈఓ ద్వివేది.. పనిచేయని ఈవీఎం!

దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా, వీటికి సంబంధించిన పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

Samayam Telugu 11 Apr 2019, 9:06 am
ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా, వీటికి సంబంధించిన పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఇంకా పోలింగ్ మొదలుకాలేదు. దీంతో ఓటేయడానికి క్యూలో నిలబడ్డ జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్బీనగర్‌ గణేష్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో పోలింగ్‌ ప్రారంభ కాలేదు. విద్యుత్‌ సరఫరా లేక కొవ్వొత్తుల సాయంతో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక, మంగళగిరిలోని 139 పోలింగ్ బూత్‌లో ఈవీఎంపై ఎంపీ అభ్యర్థి పేరు కనిపించకపోవడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలోని 190 పోలింగ్ కేంద్రంలో ఎంపీ స్థానానికి చెందిన ఈవీఎం మొరాయించింది. డోన్ పట్టణంలో 79, 1212 బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో మైక్రో ఆఫీసర్ పరశీలిస్తున్నారు.
Samayam Telugu election2


మరోవైపు, అమరావతిలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేట మున్సిపల్ హైస్కూల్లో ఓటు వేసేందుకు ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెళ్లారు. ఇదే సమయంలో అక్కడి వీవీప్యాట్‌ మొరాయించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని తెలిపారు. సాంకేతిక నిపుణులు వాటిని సరిచేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసేందుకు వీలు కల్పిస్తామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.