యాప్నగరం

నన్ను గెలిపించండి.. కన్నాను కోరిన వైసీపీ అభ్యర్థి

గుంటూరు పశ్చిన నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

Samayam Telugu 14 Mar 2019, 8:45 am
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. టీడీపీ-బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని వైసీపీ ఆరోపిస్తోంటే, ఏపీపై ముగ్గురు మోదీలు( నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్) దాడి చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. కేసులకు భయపడే జగన్.. బీజేపీకి దాసోహం అయిపోయారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీతో అంటకాగేది మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
Samayam Telugu bjp


ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఒకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లడం ఆసక్తి రేపుతోంది. గుంటూరు పశ్చిన నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయనున్న చంద్రగిరి ఏసురత్నం ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో బుధవారం కన్నావారితోటలోని కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయానికి వెళ్లిన ఏసురత్నం ఆయనతో కరచాలనం చేశారు. ఎన్నికల్లో ఓటేసి తనను గెలిపించాలని కోరుతూ ఆశీస్సులు తీసుకున్నారు. కన్నా చిరునవ్వుతో ఓకే అనడంతో ఆయన సంతోషంగా అక్కడి నుంచి వెనుదిరిగారు.

బీజేపీ-వైసీపీ బంధం గురించి టీడీపీ నేతలు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి కన్నా ఇంటికి వెళ్లడం గుంటూరు రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.