యాప్నగరం

ఉచిత వైద్యం, రైతులకు రూ. 50 వేలు, ఫించన్ల పెంపు.. జగన్ నవరత్నాలు ఇవే

ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభా ముఖంగా ప్రకటించారు.

Samayam Telugu 30 May 2019, 2:36 pm
ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపటిన అనంతరం ఆయన ప్రసగిస్తూ.. జగన్ అను నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను.. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు, మధ్యతరగతి ప్రజలు పడిన కష్టాలు, బాధలను చూశానని.. మీకు అందరికీ నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను... ప్రజల ప్రతి కష్టాన్ని తీర్చేందుకు రెండు పేజీలతోనే ఎన్నికల మ్యానిఫెస్టో తీసుకొచ్చామన్నారు. వృద్ధాప్యపు పింఛన్లను ఏడాదికి రూ.250 చొప్పున రూ.3,000 వేలకు పెంచుకుంటూ పోతామని తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి పింఛన్లు రూ.2,250కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు.
Samayam Telugu YS-jagan-speech


మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేసి 2024లో మళ్లీ ఓట్లు అడుగుతామన్నారు. పాదయాత్రతో పాటూ ప్రచారంలో ప్రస్తావించిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మనసా వాచా కర్మనా హామీలను అమలు చేస్తామని, ఏడాదిపాటు తనకు సమయం ఇస్తే అవినీతిరహిత పాలనను అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఏడాదిలోగా 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తామని, గ్రామానికి ఓ వలంటీర్ చొప్పున 4 లక్షల మందిని నియమిస్తున్నట్టు ప్రకటించారు.

వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాలు


  • రైతులకు ఉచితంగా బోర్లు.. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు
  • రైతులకు పగడిపూట 9 గంటల ఉచిత విద్యుత్
  • రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
  • రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
  • రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
  • రైతులకు సున్నా వడ్డీకే రుణాలు
  • వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
  • అన్ని రకాల వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
  • ప్రభుత్వ ఆస్పత్రుల దశా దిశా మార్చడం
  • కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
  • వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు
  • పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
  • అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు
  • మూడు దశల్లో మద్యపాన నిషేధం
  • ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ
  • ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం
  • శ్రీవారి సన్నిధిలో తలుపులు తీసే అవకాశం గొల్లలకు కల్పించడం
చదవండి: వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలు, పేదలకు అండగా సంక్షేమ పథకాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.