ఏపీపై పెద్ద కుట్ర.. ఆధారాలతో సహా బయటపెడతా: హీరో శివాజీ
ఆదివారం ఉదయం (07-04-2019) ఉదయం మీడియాకు ముందుకు వస్తానంటున్నారు శివాజీ. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్పై జరగగోయే కుట్రలకు సంబంధించిన అన్ని అంశాలను మీడియాకు వివరించడంతో పాటూ ఆధారాలతో సహా వెల్లడిస్తానన్నారు.
Samayam Telugu 6 Apr 2019, 3:03 pm
ప్రధానాంశాలు:
- నాలుగు రోజుల్లో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి
- ఆదివారం ఆధారాలతో సహా బయటపెడతాను
- సీఎస్ను ఎన్ బదిలీ చేయడం దుర్మార్గం
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న వేళ హీరో శివాజీ మరో బాంబ్ పేల్చారు. ఆంధ్రప్రదేశ్పై కుట్రలు జరుగుతున్నాయి.. మరో నాలుగు రోజుల్లో కొన్ని సంఘటనలు జరగబోతున్నట్లు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంపై జరగబోయే కుట్రలకు సంబంధించిన ఆధారాలతో సహా బయటపెడతానంటున్నారు శివాజీ. ఆదివారం ఉదయం (07-04-2019) ఉదయం మీడియాకు ముందుకు వస్తానంటున్నారు శివాజీ. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్పై జరగగోయే కుట్రలకు సంబంధించిన అన్ని అంశాలను మీడియాకు వివరించడంతో పాటూ ఆధారాలతో సహా వెల్లడిస్తానన్నారు. ఏపీ సీఎస్ను మార్చడం కంటే దారుణం ఏముంటుందన్నారు. ఇది కచ్చితంగా మోదీ కుట్రేనని.. ఎన్నికల కమిషన్ మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు.
హీరో శివాజీ గతంలో కూడా ఏపీపై కుట్రలు జరుగుతున్నాయని మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వంపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని బాంబ్ పేల్చారు. ఆపరేషన్ గరుడ పేరుతో వీడియోను విడుదల చేసి సంచలనం రేపారు.
హీరో శివాజీ గతంలో కూడా ఏపీపై కుట్రలు జరుగుతున్నాయని మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వంపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని బాంబ్ పేల్చారు. ఆపరేషన్ గరుడ పేరుతో వీడియోను విడుదల చేసి సంచలనం రేపారు.