యాప్నగరం

జగన్‌ వస్తే రాజధాని మార్చేస్తారు: చంద్రబాబు

అమరావతి నగరం హైదరాబాద్‌ను మించిపోతుందనే భయంతోనే కేసీఆర్.. జగన్‌తో చేతులు కలిపారు - తాడికొండలో చంద్రబాబు

Samayam Telugu 9 Apr 2019, 7:04 pm
తాను అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని మార్చేస్తానని జగన్‌ అంటున్నారని, టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో అమరావతి ముందు హైదరాబాద్ తేలిపోతుందనే కారణంతో కేసీఆర్.. జగన్‌తో చేతులు కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం తాడికొండలో రోడ్‌షోలో చంద్రబాబు ప్రసంగించారు.
Samayam Telugu D3tIre5XkA


ప్రపంచంలోనే 5 అత్యుత్తమ నగరాల్లో ఉండేలా అమరావతిని నిర్మిస్తానని సీఎం తెలిపారు. వైసీపీ ఓడిపోతుందనే భయంతోనే కేసీఆర్‌ ఏపీకి ప్రత్యేక హోదా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారన్ని అన్నారు. హోదాకు మద్దతిచ్చే వ్యక్తి పోలవరం నిర్మాణంపై సుప్రీంలో కేసులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. తాడికొండ నియోజవర్గంలోనే రాజధాని నిర్మాణం అవుతోందని, ఈ ప్రాంతంలో ఎవరూ ఊహించని అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వలస వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత భూముల విలువ బాగా పెరిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మరింత పెరుగుతాయన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే విలువ తగ్గిపోతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.