యాప్నగరం

జగన్, బాలయ్యలపై పోటీకి అభ్యర్థులను ప్రకటించిన జనసేన

జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఆరో జాబితాను ప్రకటించింది. జగన్, బాలయ్య బాబులపై పోటీకి అభ్యర్థులను ఖరారు చేసింది.

Samayam Telugu 22 Mar 2019, 11:02 pm
ఓవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. జనసేన పార్టీ మరో జాబితాను ప్రకటించింది. 16 అసెంబ్లీ స్థానాలకు పవన్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ జాబితాలో అనంతపురం జిల్లా నుంచి అత్యధికంగా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి పోటీ చేయనున్నారు. టీడీపీలో టికెట్ రాకపోవడంతో ఎస్పీవై రెడ్డి, ఆయన అల్లుడు ఇటీవలే పార్టీ నుంచి బయటకు రాగా.. వారికి జనసేన నుంచి ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.
Samayam Telugu pk jsp2


టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణకు పోటీగా హిందూపురం నుంచి ఆకుల ఉమేష్‌కు జనసేన టికెట్ కేటాయించింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు పోటీగా పులివెందులలో తుపాకుల చంద్రశేఖర్‌కు పవన్ అవకాశం కల్పించారు. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడు నుంచి జనసేన తరఫున పాక పవన్ కుమార్ పోటీ చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.