వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని సినీ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ అన్నారు. సోమవారం జీవిత, రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేర్లు చెప్పదలచుకోలేదు అంటూనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు.
జగన్ను ఓడించడానికే వేరే వేరు పార్టీలను సృష్టించారన్నారు. రేపు ఎన్నికలు అయిపోయిన తరవాత ఈ పార్టీలన్నీ ఒక్క చోటుకే చేరిపోతాయని టీడీపీ, జనసేన, ప్రజా శాంతి పార్టీలను ఉద్దేశించి అన్నారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దని, ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు. ఒకవేళ వీరికి ఓటు వేస్తే జగన్కు వచ్చే మెజారిటీ తగ్గిపోతుందన్నారు. ‘ఒకసారే కదా మనం పవన్ కళ్యాణ్కు వేద్దాం, కేఏ పాల్కు వేద్దాం అని దయచేసి ఓట్లు వేస్ట్ చేయొద్దు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల తేదీ దగ్గరపడటంతో ఈ ఎనిమిది తొమ్మిది రోజుల్లో తమకు చేతనైనంత వరకు, వీలైనన్ని చోట్లకు వెళ్లి జగన్ను గెలిపించమని ప్రచారం చేస్తామని జీవిత చెప్పారు. అసలు జగన్ను మనం ఎందుకు సీఎం చేయకూడదు అని సూటి ప్రశ్నను తాను ప్రజలను అడగబోతున్నానని అన్నారు. ప్రస్తుతం మనల్ని పరిపాలించే వ్యక్తులపై ఉన్న ఆరోపణలన్నీ రుజువయ్యాయని.. కానీ, జగన్ మీద ఉన్న ఒక్క ఆరోపణ కూడా రుజువుకాలేదని జీవిత చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
ఓదార్పు యాత్ర, పాదయాత్ర, ర్యాలీలు ఇలా పదేళ్లపాటు జగన్ జనంతోనే ఉన్నారని జీవిత అన్నారు. నిద్రాహారాలు మానేసి 24 గంటలపాటు ఈ పదేళ్లు జగన్ జనం మధ్యే గడిపారన్నారు. దీన్ని ఎవరైనా కాదనగలరా? అని ప్రశ్నించారు. కాదనేవారు జగన్కు ఓటేయకూడదని చెప్పొచ్చన్నారు. నేను సీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడుపుతానని ఒక వ్యక్తి పట్టుదలతో చెపుతున్నప్పుడు ఎందుకు గెలిపించకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈసారి జగన్కు ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతందన్నారు.
జగన్ను ఓడించడానికే వేరే వేరు పార్టీలను సృష్టించారన్నారు. రేపు ఎన్నికలు అయిపోయిన తరవాత ఈ పార్టీలన్నీ ఒక్క చోటుకే చేరిపోతాయని టీడీపీ, జనసేన, ప్రజా శాంతి పార్టీలను ఉద్దేశించి అన్నారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దని, ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు. ఒకవేళ వీరికి ఓటు వేస్తే జగన్కు వచ్చే మెజారిటీ తగ్గిపోతుందన్నారు. ‘ఒకసారే కదా మనం పవన్ కళ్యాణ్కు వేద్దాం, కేఏ పాల్కు వేద్దాం అని దయచేసి ఓట్లు వేస్ట్ చేయొద్దు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల తేదీ దగ్గరపడటంతో ఈ ఎనిమిది తొమ్మిది రోజుల్లో తమకు చేతనైనంత వరకు, వీలైనన్ని చోట్లకు వెళ్లి జగన్ను గెలిపించమని ప్రచారం చేస్తామని జీవిత చెప్పారు. అసలు జగన్ను మనం ఎందుకు సీఎం చేయకూడదు అని సూటి ప్రశ్నను తాను ప్రజలను అడగబోతున్నానని అన్నారు. ప్రస్తుతం మనల్ని పరిపాలించే వ్యక్తులపై ఉన్న ఆరోపణలన్నీ రుజువయ్యాయని.. కానీ, జగన్ మీద ఉన్న ఒక్క ఆరోపణ కూడా రుజువుకాలేదని జీవిత చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
ఓదార్పు యాత్ర, పాదయాత్ర, ర్యాలీలు ఇలా పదేళ్లపాటు జగన్ జనంతోనే ఉన్నారని జీవిత అన్నారు. నిద్రాహారాలు మానేసి 24 గంటలపాటు ఈ పదేళ్లు జగన్ జనం మధ్యే గడిపారన్నారు. దీన్ని ఎవరైనా కాదనగలరా? అని ప్రశ్నించారు. కాదనేవారు జగన్కు ఓటేయకూడదని చెప్పొచ్చన్నారు. నేను సీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడుపుతానని ఒక వ్యక్తి పట్టుదలతో చెపుతున్నప్పుడు ఎందుకు గెలిపించకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈసారి జగన్కు ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతందన్నారు.