యాప్నగరం

అర్ధరాత్రి కేఏ పాల్ కేకలు.. దాడి జరిగిందంటూ హంగామా!

అర్ధరాత్రి 1 గంట సమయంలో కేఏ పాల్ కేకలు పెట్టారు. హోటల్ సిబ్బందిని పరుగులు పెట్టించారు. తనపై దాడి జరిగిందంటూ హంగామా చేశారు.

Samayam Telugu 6 Apr 2019, 6:37 pm
ప్రజాశాంతి పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన కేఏ పాల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. పాల్ భీమవరం అసెంబ్లీ, నరసాపురం లోక్ సభ స్థానాల నుంచి పోటీకి నిలుచున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమవరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న పాల్ అక్కడే ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. అయితే, అర్ధరాత్రి పాల్ గట్టిగా కేకలు పెట్టడంతో అంతా ఉలిక్కిపడ్డారు.
Samayam Telugu 24852427_1348242911953138_1977093662881734188_n


తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, వెంటనే సీసీటీవీ కెమెరా దృశ్యాలను తనకు ఇవ్వాలంటూ హోటల్ సిబ్బందిని కోరారు. అయితే, కంప్యూటర్ పనిచేయడం లేదని సిబ్బంది తెలపడంతో పాల్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తనకు సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ ఇస్తారా.. లేదా అంటూ ఆయన హంగామా చేశారు. దీంతో ఎట్టకేలకు హోటల్ సిబ్బంది ఆ ఫుటేజ్‌ను ఆయనకు అందించారు.

కేఏ పాల్ చెప్పిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 1 గంట సమయంలో కేఏ పాల్ అభిమానులమని చెప్పుకుని కొందరు హోటల్‌లోకి ప్రవేశించారు. పాల్‌పై దాడికి ప్రయత్నించారు. పాల్ గట్టిగా కేకలు పెట్టడంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పాల్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. తనపై దాడి జరగవచ్చని పాల్ పలు సందర్భాల్లో వెల్లడించారు. దాడి నేపథ్యంలో పాల్‌కు భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశాలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.