యాప్నగరం

TDP: బీజేపీకి షాక్.. నేడు టీడీపీలోకి ఆలూరు అభ్యర్థి!

వైసీపీలో టిక్కెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి ఆ పార్టీ తరఫున ఆలూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు.

Samayam Telugu 26 Mar 2019, 10:47 am
కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఆ పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారు. ఇదే స్థానం నుంచి పోటీ చేస్తోన్న టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతకు ఆయన తన మద్దతు తెలపనున్నారు. దీంతో పుష్కర కాలంగా ఎడ ముఖం, పెడ ముఖంగా ఉన్న కోట్ల సోదరులు ఏకం కానున్నారు. ఆలూరు నుంచి బీజేపీ తరఫున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు హరిచక్రపాణి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన అనూహ్యంగా టీడీపీకి మద్దతు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. మంగళవారం కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో హరిచక్రపాణి టీడీపీలో చేరుతున్నారు. దీంతో అలూరులో నామినేషన్ వేసిన హరిచక్రపాణి రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు. కోట్ల సుజాతతోపాటు కోడుమూరు అభ్యర్థి రామాంజనేయులు గెలుపు కోసం కూడా ఆయన పనిచేయనున్నట్టు తెలుస్తోంది.
Samayam Telugu kotla


గత పుష్కరకాలం నుంచి దూరంగా ఉంటోన్న అన్నదమ్ములు కలయికతో ఆలూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో టీడీపీ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు, టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి జాతీయ పార్టీల నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవేగౌడ, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ సీఎంలు మమతాబెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, సహ పలువురు జాతీయ నేతలు టీడీపీ తరఫున ప్రచారం చేయనున్నారు. వీరితోపాటు బీజేపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరీలు కూడా టీడీపీ ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. మంగళవారం కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాల్లో చంద్రబాబుతో కలిసి ఫరూక్‌ అబ్దుల్లా ప్రచారంలో పాల్గొంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.