యాప్నగరం

వల్లభనేని వంశీకి నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అక్రమ ఆయుధాల కేసులో వంశీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది.

Samayam Telugu 4 Apr 2019, 12:23 am
టీడీపీ నేత, కృష్ణా జిల్లా గన్నవరం అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అక్రమ ఆయుధాల కేసులో వంశీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. వల్లభనేని వంశీ తనకు ప్రభుత్వ రక్షణ వద్దని.. ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Samayam Telugu vamsi
వల్లభనేని వంశీ


ఈ కేసు విచారణకు వంశీ హాజరు కాకపోవడంతో తాజాగా నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీనిపై వంశీపై స్పందించారు. ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఇప్పుడు ఉద్దేశ పూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.