యాప్నగరం

YS Vivekananda Reddy Death: వివేకా మృతి విషయం తెలిసి ‘పరవశించాం’.. మళ్లీ తడబడ్డ నారా లోకేష్

మంత్రి లోకేష్ మళ్లీ తడబడ్డారు. ఈసారి.. వివేకా మృతిపై ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

Samayam Telugu 18 Mar 2019, 2:52 pm
పీ మంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మళ్లీ సోషల్ మీడియాకు చిక్కారు. ఆయన మాట్లాడే తెలుగుపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ తడబడ్డారు.

మంగళగిరిలో ప్రచారం చేస్తున్న లోకేశ్‌ ఆదివారం రోడ్‌ షోలో మాట్లాడుతూ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వివేకా మరణంపై మాట్లాడుతూ.. ‘‘పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం. ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలుసా తల్లి..’’ అంటూ ప్రసంగం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.