యాప్నగరం

ఆ నా కొడుకులను తన్నాలి: నారా లోకేశ్

అమ్మా.. నాకు ఓపిక నశించింది. బురదజల్లి పారిపోతే నేను తుడుచుకుంటూ కూర్చోవాలా? పనేం లేదా? అందుకే వాళ్లను తన్నమంటున్నా.. అంటూ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 9 Apr 2019, 10:20 pm
మంగళగిరి టీడీపీ అభ్యర్థి, సీఎం తనయుడు నారా లోకేశ్ మరోసారి నోరు జారారు. ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రతిపక్ష పార్టీలు తమపై అనవసరంగా బురద చల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓపిక నశిస్తోందన్న లోకేశ్.. అలాంటి వారిని తన్నాలంటూ ఓటర్లకు చెప్పారు. వాళ్లను తన్నాలని పోలీసులకు కూడా చెప్తా అంటూ మండిపడ్డారు.
Samayam Telugu lokesh
నారా లోకేశ్


ఇళ్ల పట్టాల గురించి ఓ మహిళ తనకున్న అనుమానాలను నారా లోకేశ్ వద్ద వ్యక్తం చేయగా.. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మానందపురంలో మంగళవారం (ఏప్రిల్ 9) ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేశ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

‘అమ్మా.. నాకు ఇక ఓపిక నశించింది. ప్రతిపక్ష పార్టీలు బురదజల్లి పారిపోతారు. నేను తుడుచుకుంటూ కూర్చోవాలా? పనేం లేదా నాకు? అందుకే వాళ్లను తన్నమంటున్నా కదా. పోలీసు సోదరులకు కూడా వాళ్లను తన్నమని చెబుతున్నా. వాళ్లను తంతేనే మీ జోలికి రారు. ఆ నా కొడుకులను తన్నాలి. లేకపోతే వచ్చి పుకార్లు లేపుతారు యెదవలు’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.