యాప్నగరం

Nara Lokesh: ఆ కుట్రల వెనుక ఉంది ఎవరు: నారా లోకేష్

టీడీపీ అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం దేనికి సంకేతం? దుర్మార్గమైన ఎన్నికల సంఘం తీరును ప్రజలు గమనిస్తున్నారు

Samayam Telugu 10 Apr 2019, 6:57 pm

ప్రధానాంశాలు:

  • టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోవడం లేదు.
    వైసీపీ ఫిర్యాదులపై మాత్రం అతిగా స్పందిస్తోంది.
    ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విస్మరిస్తున్నారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu lokesh
ఏపీలో అధికారుల బదిలీలు, ఐటీ దాడులు కలకలంరేపుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ టీడీపీ మండిపడుతోంది. అధికారుల్ని బదిలీ చేయడంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను కూడా చంద్రబాబు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి అందజేశారు.
తాజాగా మంత్రి నారా లోకేష్ ఈసీ నిర్ణయాలను తప్పుబడుతూ ట్వీట్లు చేశారు. ‘టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోని ఈసీ, ప్రతిపక్షం చేసే ఆరోపణలపై అతిగా స్పందించడం ఎవరి ఆదేశాల మేరకు జరుగుతోంది? ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎన్నికల సంఘం ఎందుకు విస్మరిస్తోంది?’అని ప్రశ్నించారు.
‘టీడీపీ అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం దేనికి సంకేతం? దుర్మార్గమైన ఎన్నికల సంఘం తీరును ప్రజలు గమనిస్తున్నారు’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.