యాప్నగరం

ఓటేసి.. కన్నుమూసిన వృద్ధుడు

ఎండను సైతం లెక్క చేయకుండా ఓటేయడానికి వెళ్లిన ఆ వృద్ధుడికి అదే చివరి ఓటైంది.

Samayam Telugu 11 Apr 2019, 3:46 pm
శ్చిమ గోదావరి జిల్లాలో ఓ వృద్ధుడు తన ఓటేసి మృతిచెందాడు. బంగారు ముసలయ్య అనే వృద్ధుడు దువ్వలోని బూత్ నెంబర్ 15లో ఓటేశాడు. అనంతరం అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే అతడు కన్నుమూశాడు. ఉదయం నుంచి ఎండలో క్యూలైన్లో నిలబడటం వల్లే ఆయన మృతి చెందాడని స్థానికులు తెలిపారు.
Samayam Telugu _104731670_mediaitem104731669


విశాఖపట్నం జిల్లాలో కూడా ఓ వృద్ధుడు ఓటేయడానికి వెళ్లి చనిపోయాడు. కరెడ్ల సన్యాశిరావు(65) రావికమతం మండలం కొత్తకోటలో ఓటేసేందుకు వెళ్తూ ఎండకు సొమ్మసిల్లి మృతిచెందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.