ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని 25 లోక్సభ, 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం సోమవారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. ఏప్రిల్ 11న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్లు దాఖలు తుది గడువుకు ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ కేవలం ఐదు రోజులే దరఖాస్తులు స్వీకరిస్తామని చెబుతున్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది. 23, 24 తేదీల్లో నామినేషన్ల స్వీకరించమని ఆయన తెలిపారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం ప్రకారం 23వ తేదీన, ఆదివారం కావటంతో 24న ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజులు రిటర్నింగ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించరని ద్వివేది వెల్లడించారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. దీంతో నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచి చూస్తే నామినేషన్ల దాఖలకు ఆరు రోజులు మాత్రమే కేటాయించినట్లయింది.
ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సీట్లు కేటాయించాయి. జనసేన, కాంగ్రెస్, బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గరి కొస్తుండటంతో అభ్యర్థులందరూ ఆ పనిలో బిజీగా మారారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సీట్లు కేటాయించాయి. జనసేన, కాంగ్రెస్, బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గరి కొస్తుండటంతో అభ్యర్థులందరూ ఆ పనిలో బిజీగా మారారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు.