యాప్నగరం

డమ్మీ అభ్యర్థులా.. మేమంటే ఏంటో చూపిస్తాం: పవన్

పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోయారు, చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్న విమర్శల పట్ల పవన్ స్పందించారు. సీఏ, పీహెచ్‌డీలు చేసిన వాళ్లు డమ్మీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఇద్దరికీ మేమంటే ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు.

Samayam Telugu 3 Apr 2019, 10:25 pm
పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీతో కలిసి పోయారు, చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్న విమర్శల పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏ చదివిన కుర్రాణ్ని, పీహెచ్‌డీ చేసిన చేసిన యువకుణ్ని పోటీకి నిలబెడితే డమ్మీ అభ్యర్థి అని అహంకార పూరితంగా ఎలా మాట్లాడతారని జనసేనాని ప్రశ్నించారు. అభ్యర్థులంటే వేల కోట్లు ఉండాలా? అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులే కావాలా? అన్నారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ, వైసీపీలపై పవన్ భారీ స్థాయిలో విమర్శించారు. నా పార్టీలో ఎవరిని ఎక్కడ నిలబెట్టాలనే విషయమై మాట్లాడటానికి విజయసాయి రెడ్డి ఎవరు? చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించారు.
Samayam Telugu pk jsp


ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. మూడోవాడెవడూ రాజకీయాల్లోకి రావొద్దు. రాజకీయాలను తామిద్దరే నియంత్రించాలనేది వీరి ఉద్దేశం అని చంద్రబాబు, జగన్‌లను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు తెలియవంటున్న విమర్శలపై స్పందిస్తూ.. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని 2014లో మోదీ, బాబు అన్నారు. వైసీపీతో పొత్తు పెట్టుకుని ఉంటే వాళ్లకు మంచోణ్ని. కానీ ఒంటరిగా వెళ్తున్నందునే ఇలా విమర్శిస్తున్నారని పవన్ తెలిపారు. ఎంత సేపూ బాబుకి, జగన్‌కు ఊడిగం చేయాలి. లేదంటే ఇలా విమర్శిస్తారు. వాళ్లిద్దరికీ మేమంటే ఏంటో చూపిస్తాం అని జనసేనాని ఘాటుగా బదులిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.