యాప్నగరం

శ్రీకాకుళం కలెక్టర్ శుభకార్యం.. ఎలాంటి కానుకలు ఇవ్వొద్దు, తీసుకోవద్దు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పోలింగ్ శాతం పెంచడానికి వినూత్నంగా ఆలోచించారు. ఓ ఆహ్వాన పత్రికను రూపొందించిన ఆయన ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Samayam Telugu 10 Apr 2019, 10:45 pm
మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఓటు మీ హక్కు వినియోగించుకోండని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అధికారులు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ వినూత్నంగా ఆలోచించారు. శుభకార్యానికి ఆహ్వానిస్తోన్న తరహాలో ఓటర్ల కోసం ఆయన ఎన్నికల ఆహ్వాన పత్రికను రూపొందించారు. మన చట్ట సభలైన పార్లమెంట్, శాసనసభలకు నూతన సభ్యుల ఎన్నిక ఉత్సవం పేరిట ఆహ్వాన పత్రికకు రూపకల్పన చేశారు.
Samayam Telugu j nivas


ఏప్రిల్ 11 గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శుభముహూర్తం. మీ నివాస ప్రాంతంలో ఓటు నమోదైన పోలింగ్ కేంద్రమే వేదిక, ఈ ఎన్నికల వేడుకకు ఎలాంటి కానుకలు తీసుకురావద్దు, ఇవ్వొద్దని ఆయన పిలుపునిచ్చారు.

ఓటు ఉన్న భారతీయులంతా అధిక సంఖ్యలో పాల్గొని మన భవిష్యత్తు రూపకర్తలైన ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ప్రక్రియలో మీ ఓటు హక్కు వినియోగించుకొని బాధ్యత నిర్వర్తించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.