యాప్నగరం

కడప‌లో రిగ్గింగ్? టీడీపీ - వైసీపీల మధ్య ఘర్షణ

వైసీపీ - టీడీపీ కార్యకర్తలు తన్నుకుంటున్నారు. కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు రిగ్గింగుకు పాల్పడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Samayam Telugu 11 Apr 2019, 11:49 am
డప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గందలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ - టీడీపీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గుడెంచెరువు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్‌‌‌తో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Samayam Telugu 162815-tdp


పోలీసులు ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. గాయపడిన పలువురిని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మహంతి హుటాహుటిన జమ్మలమడుగుకు చేరుకున్నారు. మరోవైపు బద్వేలు నియోజకవర్గంలో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాశీనయన మండలం గొంతువారిపల్లె 97వ పోలింగ్‌బూత్‌లోకి చొరబడిన వైసీపీ నేతలు ఓటర్లను బయటకు పంపేశారని, పోలింగ్ కేంద్రం తలుపులు మూసి రిగ్గింగుకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.