యాప్నగరం

ఏపీలో అత్యధిక కొత్త ఓటర్లు.. విశాఖలోనే!

ఏపీలో మిగతా జిల్లాల కంటే అత్యధిక కొత్త ఓట్లు విశాఖ జిల్లాలో నమోదయ్యాయి. దీంతో విశాఖ జిల్లాలో ఓటర్ల సంఖ్య 34 లక్షలకు చేరింది.

Samayam Telugu 19 Mar 2019, 8:18 pm
నూతన ఓటర్లు అత్యధికంగా విశాఖ జిల్లాలోనే నమోదైనట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.భాస్కర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనవరి 11న ప్రచురించిన తుది ఓటర్ల జాబితాకు అదనంగా 1,81,189 మంది నూతన ఓటర్లు నమోదయ్యారని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి జిల్లావ్యాప్తంగా 34,61,217 మంది ఓటర్లుగా నమోదు కాగా, పెండింగ్లో మరో 90 వేల దరఖాస్తులు ఉన్నాయని వాటిని వారం రోజుల్లో పరిష్కరించి ఈ నెల 25వ తేదీ కల్లా సప్లిమెంటరీ ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.
Samayam Telugu 6817B0E7-1AFE-4407


స్టాట్యుటరీ పీరియడ్ 7 రోజులు లేని కారణంగా 15వ తేదీ దాటిన తర్వాత అందిన ఓటరు నమోదు దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని ఆయన తెలిపారు. 70 వేల వరకు ఫార్మ్-7 లు అందాయని, వాటిలో 80% తిరస్కరించినట్లు తెలిపారు. ఏప్రిల్ 11 జరగబోయే సాధారణ ఎన్నికలకు ఈ నెల 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. శని, ఆదివారాల్లో నామినేషన్ స్వీకరించమని, హోలీ రోజు మాత్రం నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.

తొలి రోజు రెండే నామినేషన్లు: తొలి రోజు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయని భాస్కర్ తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలకు జిల్లాలో 4052 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరకు, పాడేరు మినహా మిగిలిన అన్ని చోట్లా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. అరుకు, పాడేరులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణకు 34 వేల మంది జనరల్ స్టాఫ్, పదివేల మంది పోలీస్ సిబ్బంది పలురకాల విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.