యాప్నగరం

భర్తపై భార్య పోటీ.. కృష్ణా జిల్లాలో రసవత్తర పోరు!

కృష్ణా జిల్లాలో రసవత్తర పోరు.. భర్తపై పోటీకి సిద్ధమైన భార్య. ‘బెల్టు’ గుర్తు బరిలోకి.

Samayam Telugu 29 Mar 2019, 12:10 am
కృష్ణా జిల్లాలో రసవత్తర పోరు నెలకొంది. జిల్లాలోని పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భార్యభర్తలు బరిలోకి దిగారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైకాపా నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య కమల స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవడం విశేషం. గురువారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రిటర్నింగ్ అధికారి ఈ వివరాలు తెలిపారు.
Samayam Telugu Untit


ఈ నియోజవర్గం నుంచి మొత్తం 13 మంది బరిలో దిగుతున్నట్లు పేరొన్నారు. పార్థసారథి భార్యకు కమలకు బెల్టు గుర్తు కేటాయించారు. ఆమె కుమారుడు నితిన్‌ కృష్ణ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ల పరిశీలనలో అధికారులు అతని పేరును తొలగించారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు వైసీపీ అభ్యర్థి పార్థసారథికి మధ్య ప్రధాన పోటీ ఉంది. జనసేన అభ్యర్థులు ఇక్కడ నేరుగా పోటీ చేయడంలేదు. ఆ పార్టీ మద్దతుతో బీఎస్పీ అభ్యర్థి లంకా కమలాకర్ రాజు బరిలో నిలుచున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.