యాప్నగరం

AP New CM: 30న వైఎస్ జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం?

ఏపీ కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రాంతాలు, వర్గాల నేపథ్యంగా తమకూ అవకాశం వస్తుందేమోనని భావించే వారు పదుల సంఖ్యలో ఉన్నారు.

Samayam Telugu 25 May 2019, 9:40 am

ప్రధానాంశాలు:

  • 30న జగన్‌ ఒక్కరే ప్రమాణస్వీకారం చేసే అవకాశం
  • మంత్రి పదవులకు ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఆచితూచి వ్యవహరిస్తున్న జగన్
  • పలువురు కీలక నేతలకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ys
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. మంత్రి పదవులకు ఆశావాహులకు ఎక్కువగా ఉండటంతో ఈ పరిణామం జగన్‌కు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ నెల 30న ఆయనొక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆ రోజు మంత్రులెవరూ ఉండకపోవచ్చని, జూన్‌ మొదటి వారంలో 18-20మంది సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకుంటారని పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. కొద్ది నెలల తరువాత జరిగే విస్తరణతోనే పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటవుతుందని అంటున్నారు.
ఏపీ కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రాంతాలు, వర్గాల నేపథ్యంగా తమకూ అవకాశం వస్తుందేమోనని భావించే వారు పదుల సంఖ్యలో ఉన్నారు. కొత్త ఎమ్మెల్యేలు శుక్రవారం వైఎస్ జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. అందులో చాలామంది ‘మీతో కలిసి పనిచేయాలనుంది’ అంటూ మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. వారికి జగన్ చిరునవ్వుతోనే సమాధానం ఇస్తున్నారు తప్ప ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు.

శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కొంతమంది సీనియర్‌ ఎమ్మెల్యేలు, నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది? ఏ సామాజిక వర్గానికి ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. విశాఖపట్నం జిల్లా నుంచి అవంతి శ్రీనివాస్‌ (భీమిలి), పశ్చిమగోదావరి జిల్లా నుంచి గ్రంధి శ్రీనివాస్‌(భీమవరం), కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని(గుడివాడ), గుంటూరు జిల్లా నుంచి సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(ఎమ్మెల్సీ కోటా), అనంతపురం జిల్లా నుంచి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి(రాప్తాడు), వెంకట్రామిరెడ్డి(ధర్మవరం) తదితరుల పేర్లు సైతం ఆశావహుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కేబినెట్ కూర్పుపై పార్టీ అధినేతతో తుది నిర్ణయమని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.