యాప్నగరం

రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. శిలాఫలకాలు ధ్వంసం

అక్కడక్కడా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతలకు సంబంధించిన ఆస్తులు.. టీడీపీ హయాంలో ఏర్పాటు శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు.

Samayam Telugu 27 May 2019, 2:15 pm

ప్రధానాంశాలు:

  • కర్నూలు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు
  • టీడీపీ హయాంలో వేసిన శిలాఫలకాలు ధ్వంసం
  • క్రిష్ణగిరి మండలం పుట్లూరులో ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
151 సీట్లతో బంపర్ మెజార్టీ సాధించిన వైసీపీ.. ఏపీలో అధికారం చేపట్టబోతోంది. ఈ నెల 30 ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. నాలుగు రోజులుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడక్కడా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతలకు సంబంధించిన ఆస్తులు.. టీడీపీ హయాంలో ఏర్పాటు శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు.
తాజాగా కర్నూలు క్రిష్ణగిరి మండలం పుట్లూరులో శిలాఫలాకాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభించిన స్కూల్ అదనపు తరగతుల భవనం శిలాఫలకాన్ని సుత్తితో పగలగొట్టారు. శిలఫలకాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.