యాప్నగరం

YSRCP: ఫ్యాన్ ప్రభంజనం.. విజయసాయితో జగన్ ఆలింగనం

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పార్టీ అధినేత జగన్, ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Samayam Telugu 23 May 2019, 2:08 pm
పీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ 150 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. టీడీపీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు లోక్‌సభ ఫలితాల్లో ఏపీలో 25 స్థానాలకు గాను 23 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అద్భుతం జరిగితే తప్ప వైసీపీ గెలుపును అడ్డుకోలేరనే రీతిలో ఫలితాల సరళి ఉంది. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ.. తీర్పు ఏకపక్షంగా జగన్ వైపే కొనసాగుతోంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
Samayam Telugu Jagan
వైఎస్ జగన్


ఏపీ ఎన్నికల్లో వైసీపీకి వస్తున్న ఫలితాలపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఇరువురు నేతలు ఆలింగనం చేసుకొని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జగన్ విజయ దరహాసం


అటు వైసీపీకి సానుకూల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్.. స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. గతంలో స్వరూపానంద స్వామి ఆశ్రమానికి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.