యాప్నగరం

వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఇంట్లో విషాదం

వైఎస్ఆర్సీపీ హిందూపురం లోక్ సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శుక్రవారం మరణించారు.

Samayam Telugu 29 Mar 2019, 10:19 pm
వైఎస్ఆర్సీపీ తరఫున హిందూపురం ఎంపీగా పోటీ చేస్తున్న గోరంట‍్ల మాధవ్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కురుబ మాధవస్వామి శుక్రవారం మరణించారు. ఆయన వయసు 85 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాధవ్ తండ్రి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కర్నూలు జిల్లా పీ రుద్రవరంలో మాధవ స్వామి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Samayam Telugu gm


మాధవ్ తండ్రి మృతి పట్ల వైఎస్సార్సీపీ సంతాపం ప్రకటించింది. సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన మాధవ్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తండ్రి మరణవార్త తెలియగానే ఆయన సొంతూరు బయల్దేరి వెళ్లారు.

గోరంట్ల మాధవ్ నామినేషన్ విషయంలో చివర వరకూ ఉత్కంఠ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ రాజీనామా ఆమోదం విషయంలో ఆలస్యం కావడంతో ఎన్నికల్లో పోటీపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. చివరకు హైకోర్టు జోక్యంతో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.