యాప్నగరం

AP Eletions: చిలకలూరిపేటలో రిగ్గింగ్.. వీడియోలు బయటపెట్టిన వైసీపీ

పోలింగ్ బూత్ నెంబర్ 218లో టీడీపీ రిగ్గింగ్ చేస్తోందంటూ వైసీపీ ఆరోపించింది.. దీనికి పోలీసులు, అధికారులు సహకరిస్తున్నారంటూ వీడియోలను విడుదల చేసింది.

Samayam Telugu 11 Apr 2019, 5:41 pm
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రిగ్గింగ్ ఆరోపణలు సంచలనం రేపాయి. పోలింగ్ బూత్ నెంబర్ 218లో టీడీపీ రిగ్గింగ్ చేస్తోందంటూ వైసీపీ ఆరోపించింది.. దీనికి పోలీసులు, అధికారులు సహకరిస్తున్నారంటూ వీడియోలను విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో చనిపోయినవారు.. ఓటు వేయడానికి రానివారి పేర్లు తీసుకొని రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.
Samayam Telugu rig.


వైసీపీ ఏజెంట్లను బయటకు పంపించి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని.. వీడియోలు తీస్తున్న తమపై పోలీస్ కానిస్టేబుల్, టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని వైసీపీ ఆరోపిస్తోంది. పట్ట పగలు రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు నేతలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.