యాప్నగరం

ఓటర్లకు నోట్లు పంపిణీ.. వైసీపీ కార్యకర్తల అరెస్ట్

జీవీఎంసీ 65వ వార్డు పరిధి అక్కిరెడ్డిపాలెం, మింది, విశాఖ డెయిరీ పరిసర ప్రాంతాల్లో శనివారం కొందరు వైసీపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తమ పార్టీకే ఓటేయమని డబ్బులు పంచారు. ఈ విషయం కొందరు పోలీసులకు చెప్పడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 7 Apr 2019, 10:34 am
ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలు నగదు పంపిణీకి తెరదీశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓటుకు ఇంత అంటూ నోట్లు పంచుతున్నారు. ఈ కోవలోనే విశాఖలోని గాజువాకలో ఓటర్లకు డబ్బు పంచుతున్న ఐదుగురు వైసీపీ కార్యకర్తలను ఫ్లయింగ్ స్వ్కాడ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Samayam Telugu ysrcp


జీవీఎంసీ 65వ వార్డు పరిధి అక్కిరెడ్డిపాలెం, మింది, విశాఖ డెయిరీ పరిసర ప్రాంతాల్లో శనివారం కొందరు వైసీపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తమ పార్టీకే ఓటేయమని డబ్బులు పంచారు. ఈ విషయం కొందరు పోలీసులకు చెప్పడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్‌, వెంకటరమణ అనే వ్యక్తుల దగ్గరి నుంచి రూ.50వేలు, ఆనంద్‌రెడ్డి నుంచి రూ.1.40లక్షలు, సునీల్‌కుమార్ నుంచి రూ.94వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్తలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

గాజువాక నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సీటు హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర పార్టీలు ఇక్కడ ఎలాగైనా గెలవాలని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనిలో భాగంగా ప్రలోభాలకు తెరదీశాయని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. గాజువాకలో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు నగదు పంపిణీ చేస్తున్నారని జనసైనికులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.